Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 24, 2026Short Read
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. స్పెషల్ ట్రైన్స్ పై కేంద్రంతో చర్చిస్తాం : మాధవ్
రాబోయే నవంబర్-జనవరి అయ్యప్ప దీక్షల సీజన్ను దృష్టిలో ఉంచుకుని, తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం అదనపు రైళ్లు నడిపేలా కేంద్రంతో చర్చిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.
విజయవాడలో జరిగిన అయ్యప్ప గురుస్వాముల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, శబరిమలలో కూడా టీటీడీ తరహాలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భక్తులకు కనీస సౌకర్యాలైన అన్నప్రసాదం, వసతి, వైద్యం, మరియు త్రాగునీరు అందించేలా కేరళ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.





